
వైఎస్సార్సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ ఉపాధ్యక్షుడిగా మొగరాల హరిప్రసాద్ రెడ్డి నియామకం
పాకాల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ ఉపాధ్యక్షుడిగా మొగరాల హరిప్రసాద్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమించింది. పార్టీ బలోపేతంతో పాటు పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో ఆయనకు ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

















































































































































































