
కుమ్మెర దాడిపై .. హత్య కేసు నమోదు చేయాలి: క్రిష్ణ మనోహర్ గౌడ్
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రజక సామాజిక వర్గానికి చెందిన ప్రజలపై జరిగిన దాడి అత్యంత హేయమైనదని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు క్రిష్ణ మనోహర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన కుల అహంకారంతో జరిగిన రాక్షసత్వమని ఆయన అభివర్ణించారు.
























































































































































































