
సుఖోయ్ యుద్ధ విమానం ప్రమాదం… ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న పైలట్ మృతి
భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మృతుల్లో ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేశ్ దురాగ్కర్ (28) కూడా ఉండటం విషాదాన్ని మరింత తీవ్రం చేసింది. ఆయన గతంలో దేశ భద్రత కోసం చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.























































































































































































