
తెలంగాణలో గుడిసెలు లేకుండా చేస్తాం : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత పక్కా ఇల్లు అందజేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా
















































































































































































