contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏపీలో వైసీపీ ఓటమి పక్కా: ప్రశాంత్ కిశోర్

ఏపీ ఎన్నికలపై మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పందించారు. జూన్ 4న జగన్ కు దిగ్భ్రాంతి కలిగించే ఫలితాలు వస్తాయని కొన్నిరోజుల కిందట వ్యాఖ్యానించిన ప్రశాంత్ కిశోర్… తాజాగా తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. కౌంటింగ్ రోజు వచ్చే ఫలితాలతో జగన్ కు మైండ్ బ్లాంక్ అవుతుందని అన్నారు.

ఏపీలో జగన్ ఓటమి ఖాయమైందని పేర్కొన్నారు. రాజకీయ వ్యూహకర్తగా నాకు పదేళ్ల అనుభవం ఉంది… ఆ అనుభవంతో చెబుతున్నా… ఏపీలో వైసీపీ చిత్తుగా ఓడిపోబోతోంది అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.

దేశంలో ఎక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది తాను అంచనా వేయగలనని చెప్పారు. జగన్ పార్టీ విషయంలోనూ తన అంచనాలు తప్పవని ధీమా వ్యక్తం చేశారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :