contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు

కేంద్ర వార్షిక బడ్జెట్ 2023-24పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆర్థికమంత్రి ప్రకటించిన పన్ను రిబేటుతో ఎవరికీ ఉపయోగంలేదని, ఎందుకంటే తెలంగాణలో ఉద్యోగులకు మెరుగైన వేతనాలు అందిస్తున్నామని తెలిపారు. రూ.10 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు కల్పిస్తారని ఆశించామని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న మోదీ సర్కారు విఫలమైందనడానికి ఈ బడ్జెట్టే నిదర్శనం అని కవిత విమర్శించారు.

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు కాదని, కొన్ని రాష్ట్రాలకేనని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించేలా బడ్జెట్ ఉందని ఆమె ఆరోపించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :