contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అంతర్వేదిలో దగ్ధమైన స్వామివారి రథం- కేసు సిబిఐ కి : సియం జగన్

 

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అంతర్వేదిలో స్వామివారి రథం అగ్నికి ఆహుతైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో హిందూ మతంపై దాడి జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనకు కారకులైన దోషులు ఎవరైనా సరే కఠిన శిక్ష పడాలన్న భావనతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ డీజీపీని ఆదేశించారు. దీంతో, సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ రాసింది. దీనికి సంబంధించి రేపు జీవో వెలువడనుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :