contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కాలేజీలకు ఫీజ్ కడితే ఆ డబ్బు వెనక్కి ఇవ్వాలి: ఏపీ సీఎం జగన్ ఆదేశాలు

ఎవరైనా తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజ్ కడితే కనుక ఆ డబ్బును కాలేజీ యాజమాన్యాలు వెనక్కి ఇవ్వాలని  ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ‘జగనన్న విద్యా దీవెన’ పథకంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యాలకు చెప్పామని  అన్నారు.ఏమైనా సమస్యలుంటే విద్యార్థుల తల్లిదండ్రులు 1902 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఉన్నత విద్యా శాఖలో కాల్ సెంటర్ ఉంటుందని, దీనిపై సీఎం కార్యాలయం పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని చెప్పారు. తల్లిదండ్రులు వారి పిల్లలను గొప్పగా చదివించాలని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ‘దేవుడి దయతో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నానని’ జగన్ అన్నారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :