contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గుంటూరును భయపెడుతున్న కరోనా.. రాష్ట్రంలో అత్యధిక కేసులు

ప్రాణాంతక కరోనా వైరస్ గుంటూరు జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో మొత్తంగా 483 కేసులు నమోదు కాగా, ఒక్క గుంటూరులోనే ఏకంగా 114 కేసులున్నాయి. రాష్ట్రంలో మరే జిల్లాలోనూ ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 10 కేసులు వెలుగుచూడగా, సరిగ్గా సగం కేసులు గుంటూరులోనే నమోదు కావడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.కరోనా మహమ్మారితో రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 16 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 458 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గుంటూరు తర్వాత 91 కేసులతో కర్నూలు రెండో స్థానంలో ఉండగా, నెల్లూరు (56), కృష్ణా (44), ప్రకాశం (42) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తూర్పుగోదావరిలో అత్యల్పంగా 17 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :