contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గుడ్‌న్యూస్‌ – నేటి నుండి అందుబాటులోకి వచ్చిన రైలు సేవలు

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫోన్‌ చేసి పలు కీలక విషయాలు తెలిపారు. దీనిపై తలసాని మీడియాతో మాట్లాడుతూ… నేటి నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయని కిషన్‌రెడ్డి తెలిపారని అన్నారు. ‌ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారని చెప్పారు. రైళ్లలో ఆయా రాష్ట్రాల కూలీలను తరలిస్తామని కిషన్ రెడ్డి తెలిపారని వివరించారు. కాగా, లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటే సరికాదని, వలసకూలీలను రైళ్లలో తరలించాలని నిన్న తలసాని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రైళ్లు ఏర్పాటు చేయాలంటూ తలసాని చేసిన సూచన బాగుందని కిషన్ రెడ్డి అన్నారు. కాగా, లాక్‌డౌన్‌ విధించిన అనంతరం తొలిసారి ప్రయాణికుల కోసం రైలు కదిలింది. ఈ రోజు ఉదయం తెలంగాణ నుంచి జార్ఖండ్‌కు వలస కూలీలతో ఓ రైలు బయలు దేరింది. 
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :