- నిజామాబాద్ నగరంలో న్యాయవాదుల ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించి
- యువ న్యాయ వాది పై పోలీసుల దాడిని ఖండించిన
- YSR తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్
నిజామాబాద్ నగరంలో యువ న్యాయవాది పై పోలీసుల దాడిని నిరసిస్తూ , నిజమాబాద్ జిల్లా కోర్ట్ ఎదురుగా న్యాయవాదూలు చేస్తున్న ధర్నాలో పార్టీ నేతలతో పాల్గొన్న YSR తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్బంగా బుస్సాపూర్ శంకర్ గారు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థను కాపాడే న్యాయవాదులకే ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుంటే ఇంకా ఎవరికి రక్షణ ఉంటుంది అని ప్రశ్నించారు.
ఇటువంటి చర్యలు పునరావృతం కావద్దు అని డిమాండ్ చేశారు.
న్యాయవాదులకు న్యాయం జరిగే వరకు YSR తెలంగాణ పార్టీ తోడుగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా ఎస్ టి విభాగం అధ్యక్షులు మోహన్ నాయక్ , యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అంకార్ గణేష్ , బీసీ విభాగం నగర అధ్యక్షులు కారంపూరి రవి కుమార్ , సీనియర్ నాయకులు సన్నిథ్ గౌడ్ , శ్రీశాంత్ తదితరులు పాల్గొన్నారు