contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సియం జగన్‌ నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం …. కీలక అంశాలపై చర్చ

 

సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఇందులో నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా వ్యాప్తి‌ వల్ల రెండు రోజులకే కుదించి ఈ సమావేశాలను నిర్వహించనున్నారు.  దిశ చట్టం సవరణ ముసాయిదా బిల్లుతో పాటు పలు బిల్లులను అసెంబ్లీ అజెండాలో చేర్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, నివర్‌ తుపాను సృష్టిస్తోన్న బీభత్సంపై చర్చించే అవకాశం ఉంది.  పెండింగ్‌లో ఉన్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ కార్యాచరణను కేబినెట్‌లో ఖరారు చేసే అవకాశం ఉంది. వీటితో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి అంశాలను కూడా కేబినెట్‌ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పలు అంశాలపై మంత్రులతో జగన్ చర్చిస్తున్నట్లు సమాచారం. 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :