contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హైదరాబాద్‌లో దారుణం.. పెంపుడు కుక్క ఇంట్లోకి వచ్చిందని .. ఓనర్ పై కర్రలతో దాడి

హైదరాబాద్ మధురానగర్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. కుక్క ఇంట్లోకి వచ్చిందనే కారణంతో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి యజమానిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డొచ్చిన భార్య, అతని కుటుంబసభ్యులను చితకబాదారు. మూగజీవి అని చూడకుండా కర్కషంగా కుక్కపైనా దాడి చేసారు. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా ఉన్న ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. మధురానగర్‌- రహమత్ నగర్‌లో ఉండే శ్రీనాథ్ కుటుంబం ఓ కుక్కను పెంచుకుంటుంది. అయితే ఇటీవల ఆ కుక్క బెల్ట్ తెంపుకొని ఎదురుగా ఉన్న ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. కుక్కను పెంచడమే కాదు వేరే వాళ్లకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని శ్రీనాథ్‌కు ధనుంజయ్‌ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత గొడవ సద్దుమణిగినా.. శ్రీనాథ్‌పై ధనుంజయ్ కక్ష పెంచుకున్నాడు

ఈనెల 14న శ్రీనాథ్ తన పెంపుడు కుక్కను తీసుకొని బయటకు వాకింగ్‌కు వెళ్లాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ధనంజయ్ శ్రీనాథ్‌ను కవ్వించాడు. అనంతరం అతనిపై దాడి చేశాడు. ఈ దాడిలో అతని స్నేహితులు కూడా పాల్గొన్నారు. మెుత్తం ఐదురురు యువకులు కలిసి కర్రలతో శ్రీనాథ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. అతడి ఆర్తనాదాలు విని బయటకు వచ్చిన శ్రీనాథ్‌ భార్య కాపాడే ప్రయత్నం చేసింది. అయినా తగ్గని ధనుంజయ్ అతని స్నేహితులు.. శ్రీనాథ్ భార్యపైనా విచక్షణారహితంగా దాడి చేశారు.

యజమానిపై దాడి చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేసిన కుక్కపైనా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీనాథ్, అతని భార్యతో పాటు కుక్క కూడా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. శ్రీనాథ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :