contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తల్లి అయిన 9వ తరగతి బాలిక .. హాస్టల్‌ వార్డెన్, ఇబ్బందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు

కర్ణాటక రాష్ట్రంలో మరో అమానుష ఘటన దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. పద్నాలుగేళ్ల వయసులోనే గర్భం దాల్చిన ఓ బాలిక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొమ్మిదొవ తరగతి చదువుతున్న అమ్మాయి తొమ్మిది నెలలుగా కడుపులో బిడ్డను మోస్తూనే స్కూల్ కు వెళ్లడం విశేషం

పోలీసుల వివరాల ప్రకారం రాష్ట్రానికి చెందిన ఓ బాలిక బాగేపల్లికి దగ్గరలోని బాలికల సంక్షేమ శాఖ హాస్టల్‌లో 9వ తరగతి చదువుతోంది. అయితే ఇటీవల తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో టీచర్స్ సహాయంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఇంజెక్షన్‌ వేసి కొన్ని మందులిచ్చి పంపించేశారు వైద్యులు. అయితే ఇంటికి వచ్చిన మరో రెండు గంటల్లోనే ఆమె మళ్లీ కడుపు నొప్పి అంటూ విలవిలలాడిపోవడంతో తాలూకా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి బాలిక నిండు గర్భిణి అని తెలిపారు. ప్రసవం నొప్పుల కారణంగానే ఆమె కడుపునొప్పి వస్తుందని చెప్పి వెంటనే బాలికకు కాన్పు చేయగా.. మగబిడ్డ జన్మించాడు.

నిజానికి బాలికల హాస్టల్‌లో బాలికకు గర్భం ఎలా వచ్చిందనే విషయంపై ఇంకా వివరాలు తెలియాల్సివుంది. ఇక దీనిపై తాలూకా వైద్యాధికారి డాక్టర్‌ సి.ఎన్‌. సత్యనారాయణ రెడ్డి పోలీసులకు సమాచారం అందించగా హాస్టల్‌ వార్డెన్, ఇతర ఇబ్బందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక, శిశువు ఆస్పత్రిలో ఉండగా ఇద్దరి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :