పల్నాడు జుల్లా కారంపూడి : వైఎస్ఆర్సీపీ పల్నాడు జిల్లా కార్యదర్శి కొమ్ము చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి రామకృష్ణరెడ్డి జన్మదిన వేడుకలు కారంపూడి లోని ఆదినారాయణ కాలనీ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిధులు జడ్పీటీసీ షేక్. షఫీ, గ్రామసర్పంచ్ రామావత్. ప్రమీలభాయి తేజానాయక్ సమక్షంలో పుట్టినరోజు కేకును కట్ చేసి సంబరంగా వేడుకలను జరుపుకున్నారు అనంతరం ముఖ్యనాయకులు మరియు తదితర వైసీపీ నాయకులు మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గన్ని ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి అభివృద్ధి పధంలో నడిపిస్తు మరోవైపు కార్యకర్తలకు అండగా ఉంటూ వారి సంక్షేమనికి పాటుపడుతున్నారని పల్నాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యకర్తకు కష్టం వచ్చిన నేనున్నాను అని భరోసా ఇచ్చే నాయకుడు పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి అని పల్నాటి రామలక్ష్మణులు అనగా పిన్నెల్లి సోదరులు కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటారని ఎక్కడ ఏ సమస్య ఉన్న వాటిని పరిష్కరించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న నవరత్నాలను పేదప్రజలకు అందేలా పిన్నెల్లి సోదరులు విశేషంగా కృషిచేస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ కాలనీ అభివృద్ధి కమిటీ చైర్మన్ జోరిగే. గాలయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు చిలుకూరి. చంద్రశేఖర్ రెడ్డి, పాతూరి. రామిరెడ్డి, బొమ్మిన. అల్లయ్య, అంతరగడ్డ. ఏసోబు, ఇరిగి. రవి, ఆశం. విజయభాస్కర్ రెడ్డి, ఓరుగంటి. వెంకటరామిరెడ్డి, పొన్నూలూరి. సుభాని, ఒప్పిచర్ల దాసు, వల్లెపు. ముసలయ్య, జొన్నలగడ్డ. శ్రీను, మిద్దెపోగు. ప్రవీణ్, నందిగం. ఈసాక్, దర్శి. కృష్ణ తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.