- నర్సరీలలో మొక్కల జర్మినేషన్ బాగుండాలి
- మన ఊరు మనబడి లో పనులు పూర్తయిన వెంటనే రికార్డు చేయాలి
- హరితహారంలో 25 లక్షల మొక్కలు పెట్టడానికి స్థలాలను గుర్తించాలి
- సీఎంఆర్ రైస్ డెలివరీ వంద శాతం పూర్తి కావాలి……. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
జిల్లాలో ఈ సంవత్సరం హరితహారంలో 25 లక్షల మొక్కలు పెట్టడానికి స్థలాలను గుర్తించాలని, ఈ నెలాఖరులోగా అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ శరత్ వివిధ అభివృద్ధి పనుల పురోగతి, హరితహారం, నర్సరీలు, లేబర్ మొబలైజేశన్, ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు, సిఎంఆర్ రైస్ డెలివరీ, తదితర అంశాల పై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో కూలీల సంఖ్యను మరింత పెంచాలని, యాక్టివ్ లేబర్లో కనీసం 60 శాతం పైగా ఉండాలని తెలిపారు.
ఈనెల 20 నాటికి 24 మండలాల్లోని 639 గ్రామపంచాయతీలలో 92,264 మంది కూలీలు పనిచేస్తున్నారని, ప్రతి గ్రామ పంచాయతీకి సరాసరిగా 144 మంది కూలీలు పనిచేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ సంవత్సరం హరితహారంలో భాగంగా 25 లక్షల మొక్కలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లతో పూర్తి సంసిద్ధతతో ఉండాలన్నారు. నర్సరీలలో మొక్కల జర్మినేషన్ బాగుండాలని, అట్టి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మన ఊరు మనబడి పనులు పూర్తయిన వెంట వెంటనే రికార్డ్ చేయాలన్నారు. పూర్తయిన పనులన్నింటికీ ఈనెల 29 లోగా రికార్డ్ చేసి, ఎఫ్ టి ఓ లను జనరేట్ చేయాలని ఆయా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఎస్ డి ఎఫ్ లో చేపట్టిన పనులు, బి టి రెన్యువల్ పనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వేగవంతం చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలుకు. అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులకు తెలిపారు. సీఎంఆర్ రైస్ డెలివరీ వంద శాతం పూర్తి కావాలని డిఎస్ఓ కు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పిసిఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, డీఎస్ఓ వనజాత, డి సి ఓ ప్రసాద్, సివిల్ సప్లై స్ డిఎం సుగుణ భాయ్, డిపిఓ సురేష్ మోహన్, వ్యవసాయ శాఖ జేడి నరసింహారావు, ఇంజనీరింగ్ శాఖల ఈ ఈలు,డి ఈ లు, తదితరులు పాల్గొన్నారు.