అల్లూరి జిల్లా హుకుంపేట : నూతన అంగన్వాడి కేంద్రాన్ని మంజూరు చేయాలని ఎగ గరుడాపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. మండలంలోని తీగల వలస పంచాయతీ ఎగగరుడా పల్లి గ్రామంలో అంగన్వాడి సెంటర్ శిధిల వ్యవస్థకు చేరింది. 1990 సంవత్సరం కాలం నాటి కాలంలో నిర్మాణం చేపట్టారు. నేటికీ 33 సంవత్సరాలు అవడంతో భవనం రేకులు పాడైపోయి ప్రమాదపు అంచులో ఉంది. 30 మంది పిల్లలు అంగన్వాడి సెంటర్లో ఆటపాటలు నేర్చుకుంటున్నారు. ఈ గ్రామంలో ఇదే మెయిన్ సెంటర్ కావడంతో. పిల్లలు ఆటలు పాటలు, భోజనాలు చేసేందుకు కూడా భవనంలో సరిపడటం లేదని గ్రామస్తులు అంటున్నారు. శిధిల వ్యవస్థకు చేరిన భవనంలో ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉంటుందని పలువురు అంటున్నారు. అధికారులు గుర్తించి నాడు నేడు ద్వారా నూతనంగా అంగన్వాడి సెంటర్ నిర్మాణం చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.