- వేలాదిగా తరలి వచ్చిన నియోజకవర్గ ప్రజలు
- హాజరైన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్..
కరీంనగర్ జిల్లా: రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ సారథ్యంలో ఈరోజు మానకొండూర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాళ్ళో భాగంగా నిర్వహించిన ప్రభుత్వ సంక్షేమ పథకాల సంబురాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా గౌరవ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్ మరియు బీ.ఆర్.ఎస్. పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా ఛైర్మెన్ జీవి.రామకృష్ణా రావు హాజరయ్యారు. మానకొండూర్ నియోజకవర్గంలోని మహిళా మూర్తులు, ప్రజాప్రతినిధులు, బీ.ఆర్.ఎస్. పార్టీ శ్రేణులు మరియు అన్ని అనుబంధ సంఘాల ప్రతినిధులు వేలాదిగా తరలి రావడంతో మైదానం పూర్తిగా కిక్కిరిసి పోయింది. దశాబ్ది వేడుకల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఆనందోత్సాలతో జరుపుకుంటు, ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో పాటు మహిళా ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు.
గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై సాంస్కృతిక సారథి కళాకారులు ఆలపించిన గీతాలు ప్రజలను విశేషంగా అలరించగా, ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుతూ ఆనందంగా గడిపారు.