కరీంనగర్ జిల్లా: పట్టణంలోని 29 వ డివిజన్ కి చెందిన స్వర్గీయ సంగ లక్ష్మినారాయణ ఇటీవల గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించడం జరిగింది. విషయం తెలిసిన కరీంనగర్ నియోజకవర్గ నాయకులు మేనేని రోహిత్ రావు వెంటనే స్పందించి వారి గృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ నేపథ్యంలో మేనేని రోహిత్ రావు తనవంతుగా రూ. 10,000/- ఆర్థిక సహాయం తో పాటు బియ్యం. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మడుపు మోహన చారి చేతులమీదుగా అందించడం జరిగింది.