contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తొమ్మిది వేల రూపాయల నిషేదిత గుట్కా స్వాధీనం చేసుకున్న కరీంనగర్ టాస్క్ ఫోర్స్

 కరీంనగర్ శ్రీనగర్ కాలనీకి లోని శ్రీనివాస  కిరణం లో ఇద్దరు వ్యక్తులు నిషేధిత గుట్కా అమ్ముతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోవడం జరిగింది వారి వద్ద నుంచి తొమ్మిది వేల విలువగల అంబర్ ప్యాకెట్ లు స్వాధీనం.  గర్షకుర్తి గ్రామానికి చెందిన గొంటి శ్రీనివాస్, తండ్రి రాజయ్య,  మరియు గొంటి నరేష్ వృత్తిరీత్యా కిరాణం దుకాణం నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు . తన యొక్క రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా దుకాణం నడుపుకోవడమే కాకుండా కరీంనగర్ పరిసర ప్రాంత ప్రజలకు నిషేదిత గుట్కా ఊత్పత్తులను  సరఫరా చేస్తూ అధిక డబ్బులను ఆర్జించాలనే ఊదేశ్యంతో వీరిద్దరూ గుట్కాలను తీసుకోని  షాప్ లో ఎదురుచూస్తున్న సమయంలో వీరి కదలికలపైనా అనుమానం వచ్చిన కరీంనగర్ టాస్క్ ఫోర్స్ మరియు కరీంనగర్ టూ టౌన్ పోలీసులు వీరి వద్ద తనిఖీ చెయ్యగా తొమ్మిది  వేల  రూపాయల నిషేదిత గుట్కా ఊత్పతులను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

వీరి వద్ద నుండి తొమ్మిది  వేల రూపాయల గుట్కాలు ,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది .పట్టుబడ్డ నిందితులను విచారణ నిమిత్తం  టూ టౌన్    పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరిగింది మండలానికి చెందిన 

నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మల్లయ్య , కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ , టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :