contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గిరిజన గ్రామాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి: తిలక్

శ్రీకాకుళం : గిరిజన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతున్నదని రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ అన్నారు.

శుక్రవారం నందిగాం మండలం గొల్లూరు పంచాయతీ పరిధిలోని సొంటినూరు గ్రామంలో మండల పరిషత్ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణానికి నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తితో కలిసి తిలక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తిలక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని అన్నారు. గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకుని ప్రతి ఒక్కరు ఆర్థికాభివృద్ధి సాధించడం తో పాటు గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు కురమాన బాలకృష్ణారావు, ఎంపీటీసీ సభ్యులు సైలాడ లావణ్య ,అంబోడి విష్ణు, నందిగాం మండల యువజన నాయకులు జీరు లక్ష్మణ రెడ్డి, రట్టి నాగరాజు, సర్పంచులు మడపాల సంజీవరావు, బొమ్మాలి గున్నయ్య, తమిరి దేవేందర్, వైయస్సార్సీపి నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :