contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రజా సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం

కరీంనగర్ జిల్లా:ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని డిసిసి అధ్యక్షుడు మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.ఈ సందర్భంగా గన్నేరువరం మండలంలోని చొక్కారావు పల్లి లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ దళితులకు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షలు, ఇతరులకు ఐదు లక్షలు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, 500 కి గ్యాస్ సిలిండర్ను పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు, పేదల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. మానేరు వాగుపై గన్నేరువరం నుంచి కరీంనగర్ వరకు బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, మానకొండూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొలుపుల రవీందర్, తిప్పర్తి పరిపూర్ణ చారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :