జార్ఖండ్ – గిరిదిహ్ జిల్లా తారాతండ్ గ్రామానికి చెందిన ఓ మహిళకు పెళ్లై భర్తకు దూరంగా, ఒంటరిగా ఉంటోంది. అదే గ్రామానికి చెందిన పెళ్ళైన యువకుడు సుశీల్ తుడుతో ఆమెకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది.
పెళ్లి చేసుకోమని ఆమె బలవంతం చేయగా సుశీల్ ఒప్పుకోవట్లేదని ప్రైవేట్గా కలవాలంటూ, అతన్ని పిలిచింది. సుశీల్ ఆమెతో సరసాలు మొదలు పెట్టాడు. అప్పటికే పక్కా ప్లాన్తో సిద్ధంగా ఉన్న మహిళ చేతిలో బ్లేడ్ తీసుకుని అతని ప్రైవేట్ భాగాలను కట్ చేసింది.
దాంతో అతను అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతను చనిపోయాడని భావించిన మహిళ నేరుగా తారాతాండ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయింది.