కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో నిన్న కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సంఘం నాయకులు చేరగా బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో మండల కేంద్రానికి చెందిన పబ్బతి మల్లారెడ్డి నేడు బిఆర్ఎస్ పార్టీలో చేరారు, వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి అభివృద్ధి చెందలేదని బిఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు గెలిచిన తర్వాత మండల అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు, ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి,వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, గ్రామ శాఖ అధ్యక్షులు మీసాల ప్రభాకర్,బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.