contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రిపోర్టర్ టీవీ కథనానికి స్పందన .. వెంటనే చిన్నారులకు భోజన సదుపాయాలు

ది రిపోర్టర్ టీవీ, అల్లూరి జిల్లా: అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ పూతుకు పుట్టు జగడల మామిడి గ్రామంలోని 33 మంది ఎంపీపీ స్కూలు చిన్నారులకు కివర్ల డిపో నుంచి బియ్యం సరఫరా నిలిపివేసిన సంఘటన రిపోర్టర్ టీవీ లో వచ్చిన కథనానికి స్థానిక ఎంపీడీవో శ్రీహర్షిత్ రాజం, మండల రెవెన్యూ తాసిల్దార్ నరసింహమూర్తి వెంటనే స్పందించి కివర్ల పంచాయితీ రేషన్ డీలర్ ని సంప్రదించి పిల్లలకు భోజనాలు అందించేలా చర్యలు చేపట్టారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా రేషన్ డీలర్ ని మందలించామని అధికారులు తెలిపారు. వెంటనే చిన్నారులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసారు స్థానిక సిబ్బంది. ఈ కార్యక్రమంలో విఆర్వో, సచివాలయం సిబ్బంది, వాలంటీర్ లు ఉపాధ్యాయులు పాల్గున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :