contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Chimakurthi: ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన ప్రియురాలు

ప్రకాశం జిల్లా / చీమకుర్తి : ప్రియుడు తనను పట్టించుకోవడం లేదని కోపంతో రగిలిపోయిన ఓ యువతి.. కత్తితో దాడిచేసి అతడి మర్మంగాన్ని కోసేసింది. అత్యంత దిగ్భ్రాంతికర ఈ ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… బిహార్‌ రాష్ట్రానికి చెందిన విజయ్‌ యాదవ్‌ అనే యువకుడు.. జీవనోపాధి నిమిత్తం తొర్రగుడిపాడుకు వచ్చాడు. అక్కడ స్థానికంగా ఓ డెయిరీలో పనిచేస్తున్నారు. అతడి వివాహమైనప్పటికీ భార్య బిహార్‌లోనే ఉంటుంది. ఈ క్రమంలో అదే రాష్ట్రానికి చెందిన ఓ యువతితో విజయ్‌‌కు పరిచయమైంది.

ఈ పరిచయంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి.. శారీరక సంబధానికి దారితీసింది. కొద్దికాలంగా వీరిద్దరూ తొర్రగుడిపాడులోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి కాగా… విజయ్‌ యాదవ్‌ తనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. తన సంపాదనంతా బిహార్‌లో ఉన్న మొదటి భార్యకు పంపడమే కాకుండా.. తనను సరిగా చూసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నాడనే ఆగ్రహంగా ఉంది. దీనిపై ఇరువురి మధ్య కొద్ది రోజుల నుంచి గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు తెలిపారు.

ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం డెయిరీ వద్ద ఉన్న గదిలో విజయ్‌ నిద్రపోతుండగా కూరగాయల కత్తితో దాడిచేసింది. అతడి మర్మాంగాన్ని ఛిద్రం చేయడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె డెయిరీ యజమానికి తక్షణమే సమాచారం ఇచ్చింది. అయన వెంటనే స్పందించి విజయ్‌ యాదవ్‌ను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం ఒంగోలు రిమ్స్‌కు తరలించగా.. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది.

ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు సాగిస్తున్నారు. ఆమెను ఒంగోలులోని మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. కాగా, గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గత నెల బిహార్‌లో ఓ యువతి తన ప్రియుడు మోసం చేశాడని.. ఇంటికి వెళ్లి మర్మాంగాలను కోసేసిన ఘటన వైరల్ అయ్యింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :