contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరం మండలకేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఎస్ఈ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకులు నిరసన

టిపిసిసి పిలుపులో భాగంగా లాక్ డౌన్ సమయంలో వచ్చిన అధిక విద్యుత్ చార్జీలకు నిరసనగా కరీంనగర్ జిల్లా  గన్నేరువరం మండలకేంద్రంలో  విద్యుత్ సబ్ స్టేషన్ ఎస్ఈ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన కార్యక్రమం చేపట్టారు లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగాలు చేసుకోకుండా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వారికి విద్యుత్ బిల్లు అధిక భారంగా మారినాయి అని అన్నారు టెలిస్కోపిక్ విధానం లేక నాన్ టెలిస్కోపిక్ విధానం వలన విద్యుత్ చార్జీలు స్లాబ్ రేట్ ప్రకారం లేక పోవడంతో మూడు నెలల విద్యుత్ బిల్లులు ఒకేసారి లెక్కించడం వల్ల హైయెస్ట్ స్లాబ్ రేటు ప్రకారం విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయని పేద ప్రజలు ఈ అధిక విద్యుత్ చార్జీలను కట్టలేని పరిస్థితిలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలోని విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరారు మూడు నెలల ఇంటి కిరాయిని కట్టొద్దు హితవు పలికినా మీరే మీ చేతిలో ఉన్న కరెంటు బిల్లులను ఎందుకు మాఫీ చేయడం లేదు అని ప్రశ్నించారు ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో వచ్చినా అధిక విద్యుత్ చార్జీలు ప్రజలకు మోయలేని భారంగా ఉన్నందున ఈ విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లోని అన్ని మండల,పట్టణల్లొని విద్యుత్ కార్యాలయాల ముందు నిరసనల ద్వారా ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కొసం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి  CH అనంతరెడ్డి, జిల్లా నాయకులు కొమ్మేర రవిందర్ రెడ్డి, జాగిరీ శ్రీనివాస్ గౌడ్,రాపోలు అనీల్, గుంటూక రమేష్, సంపతి రాములు, గూడూరు ప్రవీణ్ రెడ్డి,కోలుపుల రవి తదితరులు పాల్గొన్నారు
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :