contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టులను .. సొరంగు .. పరిశీలించిన రాష్ట్ర మంత్రుల సబ్ కమిటీ

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టుకు నెలవారిగా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం అయన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రోడ్లు ,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్రస్థాయి ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలకు సాగునీరు అందించనున్న నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మన్నేవారిపల్లి వద్ద ఉన్న ఎస్ ఎల్ బి సి సొరంగంను పరిశీలించారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎస్ ఎల్ బి సి టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రతినెల 14 కోట్ల రూపాయలు అవుతాయని ఇరిగేషన్ శాఖ అధికారుల అంచనాల మేరకు ప్రతినెల క్రమం తప్పకుండా 14 కోట్ల రూపాయల నిధులను ఆర్థిక శాఖ ద్వారా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ,ఒక క్యాలెండర్ ను ఏర్పాటు చేసుకొని టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. అంతేకాక డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ను సైతం పూర్తి చేస్తామని, భువనగిరి, నియోజకవర్గంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, అచ్చంపేట నియోజకవర్గంలోని అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేపడుతామని తెలిపారు. నల్గొండ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అలాగే బ్రాహ్మణ వెల్లేముల, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువ, బునియాధిగాని కాలువ లను పూర్తి చేస్తామని చెప్పారు. అంతేకాక ఆయా ప్రాజెక్టుల కింద పెండింగ్లో ఉన్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలకు సైతం ప్రాధాన్యత నిచ్చి పరిష్కరిస్తామన్నారు. నీళ్ల కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేయడమే తమ ధ్యేయమని ,అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను విభజించుకొని నిధులను మంజూరు చేసి వాటి పూర్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.

ఎస్ ఎల్ బి సికి సంబంధించిన మిషన్ రిపేరికి అమెరికాకి వెళ్లి బేరింగ్ తెచ్చేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, అంతేకాక 42 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేశామని ఆయన తెలిపారు. ఎస్ ఎల్ బి సి టన్నేల్ పనులను చేస్తూనే టన్నేల్ పనులకు సంబంధం లేకుండా సాగునీరు వచ్చే లిప్ ఇరిగేషన్లకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ఫారెస్ట్ క్లియరెన్స్లను పూర్తి చేయాలని, అలాగే నాగార్జునసాగర్ ప్రాజక్ట్ లెఫ్ట్ కెనాల్ లైనింగ్ పూర్తి చేయాలని, హై లెవెల్ కెనాల్ కు సంబంధించి భూసేకరణ, అటవీ భూముల అనుమతి వంటి వాటికి ప్రత్యేక అంచనాలను రూపొందించి పంపాలని ఇరిగేషన్ శాఖ అధికారులతో కోరారు. నక్కలగండి,ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వంటి వాటికి ఒకే ఫైల్లో ప్రతిపాదనలు పంపిస్తే తక్షణమే మంజూరు చేస్తామని, అలాగే ఎస్ ఎల్ బి సి కి ప్రతినెలా అయ్యే బిల్లులను ఆర్థిక శాఖ నుండి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామన్నారు. ఎస్ ఎల్ బి సి ప్రపంచంలోనే అతిపెద్ద గ్రావిటీ కెనాల్ అని,నాలుగు లక్షల ఎకరాలకు నీరంధించే ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమై ప్రాజెక్టు వ్యయం 4000 కోట్లకు పెరిగిందని అన్నారు. తాము చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో మిగిలిన 30,40 శాతం ప్రాజెక్టులన్నింటితోపాటు, గత ప్రభుత్వం చేపట్టిన వాటిని సైతం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు .

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ ఎల్ బిసి టన్నెల్ పనులకు సవరించిన అంచనాల ప్రకారం 4400 కోట్ల పెంచి శుక్రవారం జరిగే క్యాబినెట్ మీటింగ్ లో మంజూరు చేస్తామని ప్రకటించారు. సొరంగం పనుల కోసం అయ్యే ఖర్చును ఏజెన్సీకి సాధ్యమైనంత త్వరగా చెల్లిస్తామని, ఎట్టి పరిస్థితులలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా 2027 సెప్టెంబర్ 20 నాటికి సాగు నీటిని అందిస్తామని ఆయన తెలిపారు. ఇకపై డిండి ప్రాజెక్టుపై ప్రతివారం సమీక్షించాలని ఇరిగేషన్ సెక్రటరీని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ తో పాటు, డిండి ప్రాజెక్టును సైతం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని అన్నారు . పెండింగ్లో ఉన్న అటవీశాఖ అనుమతులు తీసుకువచ్చేందుకు ఢిల్లీ స్థాయిలో చర్యలు తీసుకుంటామని ,ఈ విషయమై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని నల్గొండ పార్లమెంటు సభ్యులు రఘువీర్ రెడ్డి ని కోరారు. రెండువైపులా యుద్ధ ప్రాతిపదికన సొరంగం తవ్వకం పనులు చేపట్టాలని, డిండి ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా తమ ప్రభుత్వం తీసుకుంటుందని, తగిన స్థాయిలో నిధులు ఇచ్చి పూర్తి చేస్తామని తెలిపారు. నల్గొండ జిల్లాలో ఉన్న పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వ , బునియాది గాని కాలువలు గ్రావిటీ ద్వారా నీటిని అందిస్తాయని, ఈ మూడు కాలువల ద్వారా 365 రోజులు సాగునీరు అందించే అవకాశాలు ఉన్నందున వీటికి వెంటనే ఆమోదం ఇవ్వాలని ఉపముఖ్యమంత్రితో కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులకు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్ని వేగవంతం చేసేందుకు ప్రత్యేకించి ఎస్ఎల్బీసీ వద్ద సమీక్షను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే అన్ని నియోజకవర్గాలలోని ఇరిగేషన్ పనులను వేగవంతం చేస్తామని చెప్పారు.

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎస్ ఎల్ బి సి హై లెవెల్ కెనాల్ కు సంబంధించి మరమత్తులో ఉన్న 4 వ పంపును మూడు రోజుల్లో మరమ్మత్తు పూర్తి చేసి తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఉదయసముద్రం ,బ్రాహ్మణ వెల్లెముల కింద భూసేకరణకు సంబంధించి 37 కోట్ల రూపాయలు విడుదల చేస్తే రెండు నెలల్లో చెరువులన్నింటిని నింపుతామని ,దీని ద్వారా కట్టంగూరు, నార్కెట్ పల్లి మండలాల్లో సుమారు 70000 ఎకరాలు చెరువుల ద్వారా పండుతాయని తెలిపారు. ఏఎంఆర్పి శాశ్వత పరిష్కారం కాదని గతంలోనే తాను గుర్తించానని,అందుకే ఎస్ఎల్ బిసీ మాత్రమే శాశ్వత పరిష్కారంగా భావించి 2004లో మేనిఫెస్టోలో చేర్పించడం జరిగిందని, శ్రీశైలం నీరు డెడ్ స్టోరేజ్ కి వెళ్లినప్పటికీ ఎస్ ఎల్ బి సి ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చు అని, ఎస్ఎల్బీసీని త్వరితగతిన పూర్తి చేసేందుకు నేలకు 30 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి తో కోరారు. అలాగే నల్గొండ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యతపై పూర్తి చేయాలని ,ప్రతి నెల ఎస్ఎల్బీసీని సమీక్షించాలని కోరారు.
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఓవర్ ఫ్లో అవుతున్నందున గొట్టిముక్కల, సింగరాజుపల్లి రిజర్వాయర్లను నింపుకోవచ్చని, అలాగే పిళ్లాయిపల్లి కాలువ, బునియాధిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువలకు వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు.

నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ ,డిండి ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర స్థాయిలో ఫారెస్ట్ క్లియరెన్స్లకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఇరిగేషన్ శాఖ మంత్రికి సూచించారు .గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నల్గొండ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో పడ్డాయని తెలిపారు దేవరకొండ నియోజకవర్గంలో కొత్తగా మూడు లిఫ్ట్ ఇరిగేషన్లు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రితో కోరారు.
నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీరు అందేందుకు మోటార్లను నియంత్రించాలని అప్పుడే చెరువులను నింపుకోవచ్చని అన్నారు. తుంగతుర్తి ,మద్దిరాల మండలాలలో సాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన కేతిరెడ్డి కాలువ 50 ఏళ్లుగా ఎవరు పట్టించుకోలేదని, 13 కోట్ల రూపాయలు విడుదల చేస్తే కాలువ లైనింగ్ పూర్తిఅవుతుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ తెలిపారు.

అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇదివరకే మంజూరై పరిపాలన అనుమతి వచ్చిందని, త్వరలోనే దానికి శంకుస్థాపన చేయాలని కోరారు .అలాగే తన నియోజకవర్గంలో డిండి ప్రాజెక్టుకు సంబంధించి హై లెవెల్ బ్రిడ్జ్ ని మంజూరు చేయాలని, ఒకటవ డిస్ట్రిబ్యూటరీని ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న భూసేకరణను పరిష్కరించాలని ,అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తో పాటు, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు.

దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ మాట్లాడుతూ నక్కలగండి ప్రాజెక్టు కింద ఆర్ అండ్ ఆర్ లో భాగంగా మన్నేవారిపల్లె కింద ఇండ్లు కోల్పోయిన వారికి ఇచ్చినట్లుగానే నష్టపరిహారం ఇవ్వాలని ,అలాగే వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజక్టుల కింద భూములు, ఇండ్లు కోల్పోయిన కుటుంబాలలో గతంలో మైనర్లుగా ఉన్నవారు ప్రస్తుతం మేజర్లుగా అయినందున వారిని కూడా నష్టపరిహారం, ఉపాధి జాబితాలో చేర్చాలని, పెళ్లి పాకుల కాల్వ కింద రీ సర్వే చేయించి అర్హత ఉన్న వారందరికీ ఆర్ అండ్ ఏర్పాటు చేయాలని, అలాగే ఈదుల గండి పై సైతం రీసర్వే చేయించి ఆర్ అండ్ ఆర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, సింగరాజుపల్లి రిజర్వాయర్ కు సంబంధించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, నక్కలగండి కింద ప్రత్యామ్నాయ రోడ్డును ఏర్పాటు చేయాలని ,డిండి కింద 400 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని వారికి పునరావాసం కల్పించాలని కోరారు . నాగార్జునసాగర్ శాసనసభ్యులు జై వీర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఫారెస్ట్ క్లియరెన్స్ ను వెంటనే పరిష్కరించాలని కోరారు .ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సవరించిన అంచనాలను తయారు చేస్తున్నారని తెలిసిందని ,ఈ ప్రాంతంలోని రైతులు, గిరిజనులకు ఉపయోగపడే విధంగా నూతన ప్రతిపాదనలు ఉండాలని అన్నారు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అంతకుముందు చీఫ్ ఇంజనీర్ వి. అజయ్ కుమార్ నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అనంతరం ఉమ్మడి జిల్లాలో విద్యుత్ శాఖకు సంబంధించి సమస్యలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశానికి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,ఎమ్మెల్సీ నర్సిరెడ్డి,రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, నాగర్ కర్నూల్ జిల్లా యస్ పి గైక్వాడ్ వైభవ్ రఘునాథ, నల్గొండ జిల్లా ఎస చంద్ర పవార్, అదనపు కల అచ్చంపేట కల్వకుర్తి ఆర్డిఓలు మాధవి, శ్రీను, ఎస్ ఎల్ బి సి నిర్మాణ సంస్థ జయప్రకాష్ పంకజ్ గౌర్, ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :