contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రాంలీలా మైదాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

కరీంనగర్ జిల్లా: దసరా ఉత్సవాలు నిర్వహించనున్న ఎల్ఎండి కాలనీలోని రాంలీలా మైదానాన్ని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం సాయంత్రం సందర్శించారు. ఎస్సారెస్సీకి చెందిన ఈ మైదానంలో విజయ దశమి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది.ఈ సంవత్సరం కూడా ఈ మైదానంలో దసర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ఎమ్మెల్యే మైదానాన్ని పరిశీలించారు.
మైదానం అంతటా కలియ తిరిగి ఎక్కడెక్కడ ఏ విధమైన ఏర్పాట్లో చేయాలో దసరా ఉత్సవ కమిటీ ప్రతినిధులకు తగు సూచనలు చేశారు. దసరా వేడుకలను ముఖ్యంగా సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడకి తరలి వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.  ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వెంట దసరా ఉత్సవ కమిటీ కన్వీనర్ కుంట రాజేందర్ రెడ్డి, కో-కన్వీనర్ గవ్వ రాజేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒగ్గు దామోదర్, ముక్కిస రత్నాకర్ రెడ్డి,అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, ఎస్.కొండల్ రావు, మాచర్ల ఆంజయ్య, బుధారపు శ్రీనివాస్,తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు,ఎల్లారెడ్డి,గూడ కమలాకర్, దుర్గా ప్రసాద్, రఘునాథ రావుతోపాటు మహాత్మనగర్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :