contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కరోనా కాలంలో కూడా రేపులా !…. క్వారంటైన్‌లో ఉన్న మహిళపై సామూహిక అత్యాచారం

క్వారంటైన్ లో ఓ మహిళపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ లో కలకలం రేపుతోంది. సవాయి మాధోపూర్ బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో గత గురువారం ఈ ఘటన చోటుచేసుకోగా… ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, జైపూర్ కు చెందిన ఓ మహిళ లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండాల్సి వచ్చింది. రోజులు గడుస్తున్నా లాక్ డౌన్ ను ఎత్తేయకపోవడంతో… కాలినడకన ఆమె సొంతూరుకు బయల్దేరింది.గురువారం రాత్రి  ఆమె మాధోపూర్ కు చేరుకోగా… స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉంచారు. దీన్ని అదనుగా తీసుకున్న ముగ్గురు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో పాఠశాలకు చేరుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు… ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :