contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ నాయుడు

విజయనగరం జిల్లా: బాడంగి మండలం లో ఈ రోజు  లాక్ష్మున్నాయుడు బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగి మండలానికి చెందిన పిన్నవలస మరియు మళ్లంపేట గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ పింఛన్ల పంపిణీ ద్వారా బలహీన వర్గాల సంక్షేమానికి మరియు సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నందుకు వారు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బూడ ఛైర్మన్ గారు మాట్లాడుతూ ..  వికలాంగులు, వితంతువులు, మరియు వృద్ధులకు ఈ పింఛన్ ఉపశమనం కలిగిస్తుందని, వారి జీవనోపాధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పిన్నవలస సర్పంచ్ కన్నం నాయుడు, వైస్ ఎంపీపీ భాస్కరరావు , మండల తెలుగు దేశం అధ్యక్షులు రవి ,త్రినాధ్ , లచ్చుపతుల సత్యం, అప్పలనాయుడు,  సూర్యనారాయణ,పెద్దలు కన్నం నాయుడు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తొ పాటు ఎంపిడిఒ రామకృష్ణ  పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :