contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి-59

శ్రీహరికోట: యూరప్ కు చెందిన పలు ఉపగ్రహాలను మోసుకుంటూ పీఎస్ఎల్వీ-సి59 రాకెట్ రోదసిలోకి దూసుకెళ్లింది. ఈ సాయంత్రం 4.04 గంటలకు కౌంట్ డౌన్ ముగియగా… పీఎస్ఎల్వీ-సి59 వాహకనౌక నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిసింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

ప్రోబా శాటిలైట్లు సూర్యుడి వెలుపలి భాగమైన కరోనాపై పరిశోధనలు చేయనున్నాయి. కరోనా అనేది అత్యంత ప్రకాశవంతమైన భాగం కావడంతో… ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రోబా-3 శాటిలైట్లకు రూపకల్పన చేశారు. కృత్రిమ సూర్య గ్రహణాలను సృష్టించి కరోనాపై పరిశోధనలు సాగించడం ప్రోబా-3 ప్రత్యేకత.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :