contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రధాని లాక్ డౌన్ పిలుపుకు తూట్లు : సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. ప్రధాని లాక్ డౌన్ పిలుపు ఇచ్చినా బేఖాతరు చేస్తూ రాష్ట్రంలో యథేచ్చగా ఇసుక అమ్మకాలు సాగుతున్నాయని ఆరోపించారు. కరోనా విజృంభిస్తోన్న ఎంతో క్లిష్ట సమయంలో కూడా ఇసుక, మట్టి, గ్రావెల్ మాఫియా ముమ్మరంగా తవ్వకాలు చేపడుతోందని మండిపడ్డారు. ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం ఇసుక తవ్వకాలను అనుమతించడం ప్రధాని లాక్ డౌన్ పిలుపుకు తూట్లు పొడవడమేనని విమర్శించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచాలని, బ్లాక్ మార్కెట్ విక్రయాలను అడ్డుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ విభాగాల మధ్య అవగాహన లేకుండా కరోనా వ్యాప్తిని నిరోధించలేరని చంద్రబాబు స్పష్టం చేశారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :