యాదాద్రి జిల్లా వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని కోపంతో చేతివేళ్ళపై కొట్టడంతో విద్యార్థినులు చేతి మనికట్టు, బొటనవేలు విరిగాయి. తల్లిదండ్రులు సోమవారం ప్రిన్సిపల్ ను నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంగళవారం ప్రిన్సిపల్, నలుగురు టీచర్లు అందుబాటులో లేరు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.