contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి : డిఎస్పీ రాములు

జగిత్యాల జిల్లా మెట్ పల్లి :  మెట్ పల్లి సబ్ డివిజన్ పరిదిలో గల ప్రజలందరు సంతోషాల మధ్య నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని . A.రాములు DSP మెట్ పల్లి ప్రజలకు సూచించారు. ఇట్టి సందర్బంగా ఈ రోజు మెట్ పల్లి సబ్ డివిజన్ ఆపిసులో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఇటీ సమావేశం లో DSP నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు ప్రశాంతమైన వాతవరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీస్ శాఖ తరుపున భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. డిసెంబర్‌ 31 రాత్రి  నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్బంగా కోరుట్ల, ఇబ్రహింపట్నం, మల్లాపూర్ మేడిపల్లి, కత్లాపూర్ మండలాల పరదిలోని పోలీస్ యంత్రాంగం ప్రత్యెక బృందాలతో పటిష్ట బందోబస్త్ మద్య పెట్రోలింగ్‌ నిర్వహించడం జరుగుతుంది అన్నారు. పోలీసుల అధ్వర్యంలో పట్టణ, గ్రామీణా ప్రాంతాల్లోను ముమ్మరంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనీఖీలు నిర్వహించబడుతాయని. అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

పోలీసుల సూచనలు నిబంధనలు….

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు రాత్రి 12:30 గంటల వరకు పూర్తి చేసుకోవాలి. తర్వాత కొనసాగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటా౦. తెలిపారు రోడ్లపై గుంపులుగా రావద్దు, రోడ్లపైన కేక్ కటింగ్ చేయవద్దు.ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నినాదాలు ఇవ్వకూడదు అన్నారు.మద్యం మత్తులో వాహనాల నడపడం నేరం, వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేయడంతోపాటు జైలు శిక్ష విధించబడుతుంది. టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని డీజే లు నిషేధం, వినియోగిస్తే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం అని హెచ్చరించారు.ఇల్లు, ప్రవేట్ ఆస్తులపై, వీధి దీపాల పై రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టిన, అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటా౦ అన్నారు.ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటా౦ అన్నారు.న్యూ ఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్, గాంజా వంటి మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో క్లోజ్ చేయాలి, మైనర్లకు మద్యం అమ్మకూడదు బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు పెడుతాం. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని, వారి వల్ల ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే వారి సంరక్షకుల పైన కేసులు నమోదు చేస్తాం.రౌడి షిటర్లు, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యెక నిఘా పెట్టడం జరుగుతుంది అన్నారు.

ఈ నూతన సంవత్సర వేడుకుల సందర్బంగా ఎర్పాటు చేసే ఎలాంటి కార్యక్రమాలు అయన సరే నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తూ అనుమతులు తీసుకోవాలి. పై అంక్షలను ఎవరైన అతిక్రమించిన, ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 నంబర్‌కు సమాచారం అందించాలి తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు. ఈ వేడుకలను ప్రజలు, యువత తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతరణంలో నిర్వహించుకోవాలని A.రాములు DSP మెట్ పల్లి ప్రజలకు సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :