ఛత్తీస్ గడ్: ఈ మధ్య కాలంలో ఛత్తీస్ గఢ్ లో వరుస ఎన్ కౌంటర్లతో నక్సల్స్ కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల ఘటనలో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దు అటవీప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది.
బీజాపూర్ జిల్లా బారేడుబాక అటవీ ప్రాంతం వద్ద భద్రతా దళాలకు, నక్సల్స్ కు మధ్య కాల్పులు జరిగాయి. యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపడుతున్న సంయుక్త భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ ఉదయం 9 గంటల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఘటన స్థలం నుంచి పోలీసులు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.