contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభోత్సవ వేడుకలు

మెట్ పల్లి: స్థానిక అక్షర హైస్కూల్లో  భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రస్తుత సమాజంలో విద్యార్థులు క్రమశిక్షణతో, నీతి నిజాయితీతో మరియు విలువలతో కూడిన విద్యను అభ్యసించి, సమాజంలో మంచి పౌరులుగా ఉండాలని” సూచనలు ఇచ్చారు.

మరిన్ని సూచనలతో, ఎంఇఓ చంద్రశేఖర రావు మాట్లాడుతూ, “భారత్ స్కౌట్స్ మరియు గైడెన్స్ ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయం. అందరు విద్యార్థినీ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని, జీవితంలో ఉన్నతమైన స్థితులకు చేరుకోవాలని” ఆకాంక్షించారు.

కరస్పాండెంట్ శ్రీ కొత్తూరు శ్రీనివాస్ మాట్లాడుతూ, “మెట్ పల్లి డివిజన్ స్థాయిలో స్కౌట్స్ మరియు గైడెన్స్ ప్రారంభించిన మొదటి పాఠశాలగా అక్షర హైస్కూల్ నిలిచింది” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఎస్సై కిరణ్ కుమార్, జిల్లా స్కౌట్ అధికారులు మధుసూదన్, వినోద్, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

ఇదే తరహాలో, ప్రతి విద్యార్థి, విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడెన్స్ లో సభ్యత్వం తీసుకొని, జీవితంలో ఉన్నత స్థాయిలకు ఎదగాలని సూచనలు ఇవ్వబడ్డాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :