contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం మన్యం / సాలూరు పట్టణం : ఈరోజు మహానాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడినవి. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.

పట్టణంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద జరిగిన వేడుకల్లో మంత్రి సంధ్యారాణి పూలమాల వేసి, శివాజీ మహారాజ్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి ప్రసంగిస్తూ, “ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప యోధుడు, సమర్థ పరిపాలకుడు. ఆయన ధైర్యం, రాజకీయం, యుద్ధ వ్యూహాలు, ప్రజాస్వామ్య భావనలు నేటికీ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. శివాజీ స్వరాజ్య స్థాపనకు పాటుపడి, విదేశీ ఆక్రమణదారుల నుంచి దేశాన్ని రక్షించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన జీవిత గాథ ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. యువత శివాజీ మహారాజ్ ఆశయాలను అనుసరిస్తూ, సమాజ సేవలో ముందుండాలి” అని చెప్పారు.

“శివాజీ మహారాజ్ స్వదేశీ భావనకు ప్రతీక. ఆయన పరిపాలనా విధానాలు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేవి. శక్తిమంతమైన నౌకాదళాన్ని అభివృద్ధి చేసి, దేశ రక్షణలో కీలకపాత్ర పోషించారు. మనం శివాజీ ఆశయాలను అనుసరించి, దేశ అభివృద్ధికి కృషి చేయాలి,” అని ఆమె అన్నారు.

“శివాజీ మహారాజ్ వంటి మహనీయుల చరిత్రను అధ్యయనం చేయండి. వారి స్ఫూర్తితో మన లక్ష్యాలను సాధించేందుకు ముందుకెళ్లండి. దేశ భక్తి, సమాజ సేవ మనందరి బాధ్యత,” అని మంత్రి సంధ్యారాణి తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ వేడుకలో స్థానిక ప్రజలు, విద్యార్థులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :