contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏపీలో కొత్త ట్రాఫిక్ రూల్స్ … ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు!

ఏపీలో నేటి నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలులోకి వస్తోంది. కొత్త ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వాహనదారులకు భారీగా జరిమానాలు విధించనున్నారు.

కొత్త రూల్స్ – జరిమానాలు:
హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. 1,000 జరిమానా
సీట్ బెల్ట్ లేకుండా కారు నడిపితే రూ. 1,000 ఫైన్
డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే రూ. 10,000 జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు
సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ కు రూ. 1,000 జరిమానా
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 5,000 ఫైన్ తో పాటు వాహనం సీజ్ చేసే అవకాశం
ఇన్స్యూరెన్స్ లేకుండా వాహనం నడిపితే తొలిసారి రూ. 2 వేలు, రెండోసారి రూ. 4 వేలు జరిమానా
సెల్ ఫోన్ వాడుతూ వాహనం నడిపితే తొలిసారి రూ. 1,500… రెండోసారి రూ. 10 వేల ఫైన్
బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ. 1,000 జరిమానా
వాహనాల రేసింగ్ కు పాల్పడితే తొలిసారి రూ. 5 వేలు, రెండోసారి రూ. 10 వేల ఫైన్
ఆటో డ్రైవర్లు యూనిఫాం లేకుండా వాహనం నడిపితే తొలిసారి రూ. 150, రెండోసారి రూ. 300 జరిమానా.

ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించే వారిని సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తించి ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు. నిబంధనలకు లోబడి నడుచుకోవాలని వాహనదారులకు సూచించారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :