contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మాజీ మంత్రి విడదల రజినీకి బిగ్ షాక్.. ఏసీబీ కేసు నమోదు..

పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ. 2.2 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని సహా అప్పటి గుంటూరు ఆర్‌వీఈవో, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, మరికొందరిపై ఏసీబీ కేసు నమోదైంది.

ఈ కేసులో రజినిని ఏ1గా, పల్లె జాషువాను ఏ2గా, రజిని మరిది గోపిని ఏ3గా, ఆమె పీఏ దొడ్డ రామకృష్ణను ఏ4గా చేర్చారు. రజిని బెదిరింపులు, అక్రమ వసూళ్లపై గతంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు అందింది. దీంతో ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీశ్‌కుమార్ గుప్తా విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ చేయించిన దర్యాప్తులో ఆధారాలు లభించడంతో నిన్న కేసు నమోదు చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :