contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చలాన్ల క్లియ‌రెన్స్‌కు రెండు రోజులే ఛాన్స్‌..

తెలంగాణ వాహ‌నాల పెండింగ్ చలాన్ల క్లియ‌రెన్స్‌కు రాయితీ మ‌రో రెండు రోజులు మాత్ర‌మే అమ‌లు కానుంది. రాయితీతో చలాన్ల క్లియ‌రెన్స్ ఈ నెల 1న మొద‌లు కాగా.. మ‌రో రెండు రోజుల్లో అంటే ఈ నెలాఖ‌రున, మార్చి 31తో ముగియ‌నుంది. ఈ గ‌డువును మ‌రింత కాలం పాటు పొడిగించే అవ‌కాశం లేద‌ని తెలిపిన తెలంగాణ పోలీసు శాఖ..గ‌డువు దాటినా ఇంకా పెండింగ్‌లోనే చలాన్లు ఉంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం నాడు తెలంగాణ పోలీసు శాఖ నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.

ఇదిలా ఉంటే.. భారీ రాయితీతో కూడిన పెండింగ్ ‌చలాన్ల క్లియ‌రెన్స్‌కు భారీ స్పంద‌నే ల‌భించింది. మంగ‌ళ‌వారం నాటికి 2.50 లక్షల పెండింగ్ చలాన్‌లను వాహనదారులు క్లియర్ చేసుకున్నారు. రూ.800 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయినట్లు పోలీసు శాఖ తెలిపింది. చలాన్ల క్లియరెన్స్ తో రూ.240 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లు పోలీసు శాఖ పేర్కొంది. ఇప్పటికీ ‌చలాన్‌లు క్లియర్‌ చేయని వారు మిగిలిన 2 రోజుల్లో క్లియర్‌ చేసుకోవాలని సూచించింది.

రాయితీతో పెండింగ్ ‌చలాన్ల‌ను క్లియ‌ర్ చేసుకోవాలంటూ గ‌త నెల ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన తెలంగాణ పోలీసు శాఖ బైకులు 25 శాతం చెల్లిస్తే సరిపోతుందని.. 75% చలాన్‌ అమౌంట్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపిన సంగ‌తి తెలిసిందే. కార్లు, లైట్ మోటార్ వెహికల్స్‌‌కు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, తోపుడు బండ్లకి 80 శాతం రాయితీ కల్పించిన సంగ‌తి తెలిసిందే.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :