తెలంగాణ ప్రభుత్వం సోమవారం మరో నామినేటెడ్ పదవిని భర్తీ చేసింది. తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా సోమా భరత్ కుమార్ ను నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సోమా భరత్ కుమార్ నియామక ఉత్తర్వులను అందుకున్నారు. ఈ పదవిలో భరత్ కుమార్ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవిలో నియమించిన కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో డెయిరీ రంగం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా శ్రీ సోమా భరత్ కుమార్ ను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం గారి నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమా భరత్ కుమార్ ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. pic.twitter.com/wV9hFiVxul
— Telangana CMO (@TelanganaCMO) November 7, 2022