contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మేళ్ళవాగు ఆర్&బి స్థలం లో అక్రమ నిర్మాణాలు – పట్టించుకోని అధికారులు

  • అధికారుల హస్తం ఉందంటున్న స్థానికులు
  • పట్టించుకోని బొల్లాపల్లి ఎమ్మార్వో
  • ఆర్ & బి డీఈ కి చెప్పమంటున్న ఫారెస్ట్ అధికారి
  • నాకు ఎటువంటి సమాచారం లేదంటున్న బొల్లాపల్లి ఎమ్మార్వో

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్ళవాగు గ్రామా శివారులో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. భూమి కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారు. మేళ్ళవాగు మెయిన్ రోడ్డు పక్కన అటవీశాఖ బంగ్లా ఉండేది. అటవీశాఖ బంగ్లా ని అనుకుని ఆర్ & బి భూమి ఉంది. ఆ భూమిలో దర్జాగా అక్రమ నిర్మాణం సాగిస్తున్నారు. కానీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అటవీశాఖ వారు మాత్రం ఆ భూమి మాది కాదని, ఆర్ & బి వారికి తెలియజేశామని, ఆర్ & బి డీఈ బొల్లాపల్లి ఎమ్మార్వోకి తెలిపితే నేటికీ చర్యలు తీసుకోవటం లో జాప్యం చేస్తున్నారని అన్నారు. ఈ విషయం పై బొల్లాపల్లి ఎమ్మార్వో ని అడిగితె నాకు ఎటువంటి లెటర్ రాలేదని బుకాయించాడు. ఇకనైనా అధికారులు స్పందించి దర్జాగా కబ్జా చేస్తున్న వారిని గుర్తించి శిక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :