contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అమీన్ పూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు ..

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ తహశీల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్ రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం బండ్లగూడకు చెందిన వెంకటేశం యాదవ్ మామ ఇటీవల మృతి చెందడంతో ఎకరా 20 గుంటల భూమిని ధరణిలో తన అత్తగారైన జయమ్మ పేరును చేర్చాలని అమీన్ పూర్ తహశీల్దార్ కార్యాలయంలో సంప్రదించగా రూ. 30 వేలు లంచం ఇవ్వాలని ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్ డిమాండ్ చేశారు. బాధితుడు వెంకటేశం ఏసీబీ అధికారులను సంప్రదించి అరుణ్ ను కలవగా అరుణ్ కు చెందిన TS 15 FB 5102 గల బెలెనో కారు డాష్ బోర్డులో పెట్టమని చెప్పడంతో డాష్ బోర్డులో డబ్బులు పెట్టాడు. లంచం ఇచ్చాకే ధరణిలో పేరును నమోదు చేశారు. ఏసీబీ ఇన్స్ పెక్టర్ వేణు, రమేష్ తో కలిసి దాడి చేయగా కారు డాష్ బోర్డులో నుంచి లంచం మొత్తం రికవరీ చేసి రసాయన పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలిందని తెలిపారు. అరుణ్ ను, జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్ ఇళ్లల్లోనూ సోదాలు చేస్తామన్నారు. వీరిద్దరిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :