- మత్తడిగూడలో సిడాం శంభు పటేల్ 6వ వర్ధంతి
- ఆదివాసీల హక్కులే జీవితంగా భావించిన హక్కుల యోధుడు సిడాం శంభు పటేల్: ఆత్రం సుగుణక్క
ఆదిలాబాద్, ఉట్నూర్: తొలితరం ఆదివాసి ఉద్యమ నేత సిడాం శంభు పటేల్ అని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణక్క అన్నారు.ఉట్నూర్ మండలం మత్తడిగూడలో సిడాం శంభు పటేల్ 6వ వర్ధంతి సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుగుణక్క పాల్గొని సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ ఆదివాసీల హక్కులే జీవితంగా భావించిన హక్కుల యోధుడు సిడాం శంభు పటేల్ అని, ఆదివాసీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు.తెలంగాణ పోరాట వీరుడిగా,తుడుం దెబ్బ వ్యవస్థాపకులుగా,ఆదివాసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆదివాసీల మనుగడ కోసం పోరాడి,ఆదివాసీ చట్టాల అమలు కోసం కృషి చేసిన నాయకుడు సిడాం శంభు పటేల్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. నివాళులర్పించిన వారిలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగ రావు,కనక వెంకటేశ్వర్లు, పలువురు ఆదివాసి నాయకులు వున్నారు.