- రూ.5 లక్షలు విలువైన నోట్లతో ప్రత్యేక అలంకరణ
పిఠాపురం: శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పిఠాపురం మండలం పి.రాయవరంలో వేంచేసి ఉన్న శ్రీ కనక దుర్గా దేవి అమ్మవారు మంగళవారం (ఈరోజు) శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గర్భాలయము, అంతరాలయము, ముఖ మండపము నందు సుమారు ఐదు లక్షల రూపాయల నూతన కరెన్సీ నోట్లతో అలంకరించినట్లు శ్రీ కనక దుర్గా దేవి ఆలయ సంఘం, ఉత్సవ కమిటీ సభ్యులు సిరిపిరెడ్డి వెంకటరమణ, మొగిలి అంజిబాబు, కొండాడ నాగు, సిరిపిరెడ్డి సుబ్రహ్మణ్యం, మారిశెట్టి తాతాజీ, కట్టా శివశంకర్ తెలియజేశారు. భక్తులందరూ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో నూతన కరెన్సీ నోట్లతో అలంకరింపబడిన అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా వారు తెలిపారు.