contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాల బిల్లు ఇవ్వలేదని డైరీ ముందు నిరసన .. దిగొచ్చిన యాజమాన్యం

మదనపల్లి:మదనపల్లె మండలం బెంగళూరు రోడ్డు లోని అమూల్ పాల డైరీ ముందు ఓ రైతు పాల బిల్లులు చెల్లించాలంటు శుక్రవారం ఆందోళనకు దిగాడు. గత మూడు నెలలుగా తమ అమూల్ డైరీ పాల బిల్లులు చెల్లించలేదని వాపోయారు.  తమ సంఘానికి మొత్తం మూడు లక్షల రూపాయలు రావలసి ఉందని తెలిపారు. వెంటనే తనకు రావలసిన బిల్లును చెల్లించాలని డిమాండ్ చేశారు.  ఈ విషయమై అమూల్ డైరీ మేనేజర్ ని వివరణ కోరగా అమూల్ డైరీ మేనేజర్ లక్ష్మీకాంత్ మాట్లాడుతూ టెక్నికల్ ఇష్యూతో ఎవరికైనా పడకపోయి ఉంటే సాయంత్రానికి ఆయా సంఘం అకౌంట్ లో నగదు జమ అవుతుందని తెలిపారు. ఈ విషయమై రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :