AP: ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన, రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్న వారికి సీఐడీ చుక్కలు చూపిస్తుంది .
ఇకపై ఈ వింగ్ మరింత ఫోకస్ పెంచనుంది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై 24 గంటలు మానిటరింగ్ ఉండేలా ఒక మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసింది.
ఏ ID నుంచి పోస్ట్ పెడుతున్నారు, ఎలాంటి పోస్టులు పెడుతున్నారు..? అనే అంశాలను గమనిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పోస్టులను తొలగిస్తూ.. వాటిని పోస్ట్ చేసినవారిపై కట్టినమైన చర్యలు తీసుకోనున్నారు.
ఈ మానిటరింగ్ సెల్లో సోషల్ మీడియాతో పాటు ఆన్లైన్, సైబర్కు సంబంధించిన అన్ని వ్యవహారాలపై నైపుణ్యం ఉన్న కానిస్టేబుల్స్ ఉంటారు. వీరితో పాటు మరో 25 మంది నిపుణులైన అధికారులను కుడా నియమించనున్నారు..
ఈ టీమ్లో మొత్తం 100 మందికి పైగా ప్రత్యేక శిక్షణ పొందినవారు ఉంటారు. విదేశాల నుండి పోస్టులు పెట్టిన వారిని కూడా శిక్ష వేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందకు వెళ్లనున్నారు.
ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సోషల్ మీడియాపై సీఐడీ మరింత ఫోకస్ పెట్టింది. రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా, వ్యక్తులను కించపరిచేలా ఎవ్వరూ పోస్టులు పెట్టినా తోలు తీయనున్నారు.
సొంత ఐడీ అయినా, ఫేక్ ఐడీ అయినా కూడా ఈజీగా పట్టేస్తారు. తద్వారా సోషల్ మీడియా ద్వారా జరిగే వేధింపులకు చెక్ పెట్టనున్నారు.
ఈ ప్రత్యేక విభాగం నిత్యం అన్ని రకాల పోస్టులను మానిటర్ చేస్తుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులపై ఉక్కుపాదం మోపుతుంది.
పదే, పదే తొలగిస్తూ పదే పదే అలా చేస్తున్నా వారిపై షీట్స్ కూడా ఓపెన్ చేయనున్నారు.