అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో15, 16వ వార్డు నందు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ప్రాపర్టీ టాక్స్ , వాటర్ టాక్స్ పాత బకాయిల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి యజమానులు ఆస్తి పన్ను, నీటి పన్ను పాత బకాయిలను వెంటనే చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడగలుగుతారని ఆయన తెలిపారు. గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు 100% పాత బకాయిల కు సహకరిస్తే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మేనేజర్ రాంబాబు, ఆర్వో సతీష్ కమలాకర్ ఎనిమిదవ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
