అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పెన్షన్లు పంపిణీ చేయుటకు ప్రభుత్వము ఇచ్చిన కొత్త బయోమెట్రిక్ డివైసులును ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనల్లో పంపిణీ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆధునీకరణ చేసినటువంటి బయోమెట్రిక్ పరికరాలను సచివాలయ సిబ్బందికి పంపిణీ చేయడం జరిగినది. మండల వ్యాప్తంగా 123 మంది సచివాలయ సిబ్బందికి 123 డివైసులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఈవో ఆర్ డి శివాజీ రెడ్డి , మండల పరిషత్ సిబ్బంది , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
