contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మృతుల కుటుంబాలకు గుమ్మనూరు నారాయణ ఆర్థిక సహాయం

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం వేరువేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో మృతి చెందిన మృతుల కుటుంబాలను గుంతకల్లు ఎమ్మెల్యే సోదరులు గుమ్మనూరు నారాయణ పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పామిడి పట్టణానికి చెందిన రంగనాయకులు మరియు గుత్తి మండలం బేతపల్లి గ్రామంలోని నీటి గుంటలో పడి మృతి చెందిన నాగరాజు కుటుంబాలను నారాయణ పరామర్శించి ఇరువురి మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీ రూమ్లో భద్రపరచగా మృతదేహాలను ఆయన సందర్శించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం నీటి గుంటలో పడి మృతి చెందిన నాగరాజు కుటుంబానికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పామిడి పట్టణానికి చెందిన రంగనాయకులు కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. మృతుల కుటుంబానికి ఎన్డీఏ ప్రభుత్వంతోపాటు గుమ్మనూరు నారాయణ కుటుంబం అన్నివేళలా అండగా ఉంటుందని ఎవరికి ఏ కష్టం వచ్చినా తమను సంప్రదించవచ్చునని ఆయన ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బేతపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు బద్రి వలి నాగరాజు శ్రీనివాసులు తోపాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :