contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గ్రామాలని మత్తులో ముంచేస్తున్న బెల్టుషాపులు

  • 3 పెగ్గులు, 6 గ్లాసులుగా బెల్టు షాపులు
  • రైడ్ చేయడానికి జంకుతున్నా ఎక్సైజ్ శాఖ
  • పాత్రికేయులు పాత్ర కీలకంగా మారిందా….?
  • అధికారులు పర్యవేక్షణ నామమాత్రమే
  • గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం
  • బెల్ట్ షాపు లపై ఎక్సైజ్ అధికారులకు ప్రేమేందుకో

 

అల్లూరి జిల్లా, హుకుంపేట, ది రిపోర్టర్ : మండలంలో మద్యం ఏరులై పారుతోందని అని చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే వీధి వీధిన, ఇంటి పక్కన.. ఇలా ఎక్కడ చూసినా మద్యం బెల్టు షాపులే. ఫోన్‌ కొడితే ఇంటికే మద్యం డెలివరీ అవుతోంది. అధికారులు చెప్పే మాటలన్నీ నీటిమూటలేనని.. వాస్తవం వేరని చెప్పడానికి మండలంలో వాడ, పల్లె అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్న బెల్టుషాపులే సాక్ష్యాలు. అధికారుల అండదండలతో 3 పెగ్గులు, 6 గ్లాసులుగా ఈ వ్యాపారం వర్థిల్లుతోంది. ఊళ్లని మత్తులో ముంచేస్తున్న బెల్టుషాపుల దుకాణాలపై

ది రిపోర్టర్ ప్రత్యేక కథనం: 

ఊళ్లలో ఏరులై పారుతున్న మద్యం “ఏదైనా గ్రామంలో మినరల్‌ వాటర్‌ ప్లాంటు ఉందో లేదో నాకైతే తెలియదు.కానీ బెల్టు షాపులు లేని గ్రామం లేదు. ఫోన్‌ కొడితే మినరల్‌ వాటర్‌ వస్తుందో లేదో తెలియదు కానీ, మద్యం సీసాలను నేరుగా ఇంటికే వస్తోంది.ప్రతి మనిషినీ ఎలా తాగుబోతును చేయాలా అనే ఆలోచనతోనే బెల్ట్ దుకాణాలను గ్రామస్థాయి వరకు తీసుకువచ్చారు .మండలంలో బెల్టుషాపు ఇప్పుడున్న క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏ మాత్రం పొంతన లేదు. హుకుంపేట నుంచి ఉప్ప , బాకురు , వరకూ ఏ గల్లీలో చూసినా బెల్టుషాపులే. చిల్లర దుకాణాలు,పర్మిట్ రూమ్, కిరాణా కొట్లు, కూల్‌డ్రింక్‌ షాపులు ఎక్కడ చూసినా మద్యం అమ్మకాలే. మరికొందరైతే ఇళ్లనే బెల్టు షాపులుగా మార్చేసి నడిపిస్తున్నారు. ప్రభుత్వ వైన్స్ దుకాణాల నుంచే వీటికి మద్యం సరఫరా అవుతోంది. లేకుంటే ఒడిశా బోర్డర్ 15 కిలోమీటర్ల దూరం కాబట్టి అక్కడ నుంచి తెచ్చి అమ్మకాలు చేస్తుంటారు. మండలంలోని గ్రామాల్లో మొత్తం సుమారు 20 కు పైగా బెల్టుషాపులు లెక్క తేలాయి. తక్కువలో తక్కువ ఊరికి రెండు, మూడు నుంచి ఐదు , ఆరు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఈ దుకాణాల నిర్వహణలో వైన్స్ నిర్వాహకుల మద్దతుదారులు, సానుభూతిపరులదే ప్రధాన పాత్ర.మండలంలో ప్రభుత్వ మద్యం దుకాణం నడుస్తుంది. మరోవైపు క్షేత్రస్థాయిలో వైన్స్ నిర్వాహకులు బెల్టుషాపుల ద్వారా ప్రజల్ని దోచుకుంటున్నారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లు ఉన్నప్పటికీ ఇప్పుడు ఏ బెల్టుషాపు వద్ద చూసినా సరే ‘పర్మిట్‌’ లేని రూమ్‌లే కనిపిస్తున్నాయి. వాటిలో అడ్డగోలు అమ్మకాలే దర్శనమిస్తున్నాయి.
బెల్ట్ షాపులకు వైన్స్ దుకాణాల నుంచే మద్యం సరఫరా అవుతోంది. అక్కడ పనిచేసే సిబ్బంది.బెల్టు షాపుల నిర్వాహకులతో చేతులు కలిపి వారికి సహకరిస్తున్నారు. ఒక్కో సీసాపై అదనంగా 10 నుంచి 15 రూపాయల చొప్పున తీసుకుని కావాల్సినవన్నీ అందిస్తున్నారు. బెల్టు షాపులవారు వాటిని గ్రామాలకు తీసుకెళ్లి.. ఆ రేటుపై అదనంగా మరో 50 నుంచి 70 రూపాయలు వసూలు చేసి మందుబాబులకు అమ్ముతున్నారు. పాడేరు మొదకొండమ్మ తల్లి జాతర కావడంతో పాడేరు , హుకుంపేట మద్యం దుకాణాలు మూసివేశారు.జిల్లా కూతవేటు దూరం లో ఉన్న హుకుంపేట మండల కేంద్రం లో బెల్ట్ షాప్ లు జోరు పెరిగాయి. ప్రభుత్వ దుకాణాల్లో 150 రూపాయలు ఉండే క్వార్టర్‌ సీసా.. బెల్టు షాపుల్లో 300 రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఈ రేటు ఇంకా పెరుగుతుంది. గ్రామస్థాయిల్లోనూ బెల్ట లను పెంచుకుంటూ పోవడమేంటని మహిళలు, గ్రామస్థులు నిలదీస్తున్నారు. కుటుంబాలను నాశనం చేస్తున్న మద్యపానాన్ని, బెల్టుషాపులను నిర్మూలించాలని పలువురు గిరిజన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మండల కేంద్రంలో మద్యం దుకాణం తెరిచి ఉన్నా, మూసి ఉంచినా.. ఈ బెల్ట్ షాపులో ఎప్పుడు కావాలన్నా సరకు దొరుకుతుంది. హుకుంపేట ,ఉప్ప, బాకురు, వంటి గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎదురుగానే నడుస్తున్నాయి. దీన్ని బట్టి ఎవరైనా ఫిర్యాదు చేస్తారేమో అనే భయం వారిలో ఏ కోశాన లేదనేది అర్థమవుతోంది.పాత్రికేయులు మద్దతు కీలగంగా ఉందని ఇట్టే అర్ధం అవుతుంది ఏకంగా మహిళల చేతనే బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మిస్తున్నారు. ఇలా చేస్తే ఎలాంటి గొడవా ఉండదనే ఉద్దేశంతోనే నిర్వహిస్తున్నారు.ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నారు. నీళ్ల సీసాలు అమ్మినట్లు అమ్ముతున్నారు. ఇకనైనా అధికారులు పట్టించుకుని బెల్ట్ దుకాణాల పై దాడులు నిర్వహించి బెల్ట్ షాపులను లేకుండా చేయాలని కోరుతున్నారు.

గల్లిగల్లీకో బెల్ట్‌ షాప్‌…

వైన్స్‌ షాపుల యజమానులు అండదండలతో గ్రామాల్లో వాడవాడలా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎంఆర్పీపై రూ.50 అదనంగా ఇస్తే ఏ అధికారి మీ జోలికి రారు అని ప్రభుత్వ వైన్‌ షాపు నిర్వాహకులు యథేచ్ఛగా పేర్కొంటున్నట్లు బెల్ట్ షాప్ నిర్వహకులు చెబుతున్నారు. దీంతో బెల్ట్‌ షాప్‌ అమ్మకందారులు ఆటోల్లో మద్యాన్ని బెల్టుషాపులకి చేరవేస్తున్నారు. ఇలా మండలంలో మూడు గ్లాసులు ఆరు పెగ్గులుగా బెల్టుషాపుల వ్యాపారం సాగుతోంది. మామూళ్ల మత్తులో అధికారులు ఉండగా స్థానికులు,ప్రజా ప్రతినిధులు సైతం ఎన్నిసార్లు అధికారుల దష్టికి తీసుకువెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మండల వ్యాప్తంగా గ్రామాల్లో సుమారు 20 పైగా బెల్ట్‌ షాపులు ఉన్నాయి. దీంతో గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండని వారు కూడా మద్యానికి బానిస అవుతున్నారు. వారి తల్లిదండ్రులు అధికారుల దష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోని దుస్థితి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాటు సారా పై కొరడా జూలుపించినట్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైన్‌ షాప్‌ నిర్వాహకులపై ,మద్యం విక్రయించే వారిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :