contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ధళిత యువకుడు రాజేష్ పై దాడి చేసిన వారిని వెంటనే ఆరేస్టు చేయాలి

అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి, ది రిపోర్టర్  : అనకాపల్లి జిల్లా,దేవరాపల్లి మండలం పరిధిలో గల ఎ.కొత్తపల్లి గ్రామంలో దళిత యువకుడు ఓలిమరక రాజేష్ పై దాడిచేసిన పెత్తందార్లును వెంటనే ఆరేస్టు చేయాలి కులవివక్షత వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి ఇర్లె చిరంజివి జిల్లా అద్యక్షులు గాడి ప్రసాద్ డిమాండ్ చేసారు, మంగళవారం వారు ప్రకటన విడుదల చేసారు, ఓ భూవివాదంలో రాజేష్ పై ఎప్రిల్ 17 న ఆగ్రామానికి చేందిన పెత్తందార్లు దాడి చేయగా రాజేష్ దేవరాపల్లి పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు, నాలుగు రోజులు తరువాత తత్సారాం చేసి 21న కేసు నమోదు చేసారని తెలిపారు, ఇప్పటికే రెండు నేలలు కాలం గడుస్తున్న దర్యాప్తు పేరుతో పోలీసులు కాలేక్షేపం చేసి దోషులను రక్షించె ప్రయత్నంలో ఉన్నారని తెలిపారు,ఇప్పటికే దళితులకు రక్షణ లెకుండా పోయిందని పోలీసులు కాలేక్షేపం చేయడం వలన మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు వెంటనే పెత్తన దార్లును ఆరేస్టు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా దళితులను కూడగట్టి అందోళన చేస్తామని వారు స్పష్టంచేశారు,

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :